PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం రైతులకు కోసం పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో మనం ఇప్పుడు రెండు స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ పథకాల ద్వారా రైతులకు ఏటా రూ. 42 వేలు లభిస్తాయని చెప్పుకోవచ్చు.
2/ 9
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ అందరికీ తెలిసిందే. ఈ స్కీమ్లో చేరిని వారికి మోదీ సర్కార్ ఏటా రూ. 6 వేలు ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా వస్తున్నాయి.
3/ 9
నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ. 6 వేలు లభిస్తాయి. ఈ స్కీమ్లో ఇప్పటిచే చాలా మంది రైతులు చేరారు. మీరు కూడా పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ పథకంలో జాయిన్ కావొచ్చు.
4/ 9
బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పొలం పట్టా వంటివి ఉంటే సరిపోతుంది. ఉచితంగానే ఈ పథకంలో చేరిపోవచ్చు. ఏటా రూ. 6 వేలు పొందొచ్చు. ఇటీవలనే ప్రభుత్వం 13వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది.
5/ 9
అలాగే భారత ప్రభుత్వం అన్నదాతల కోసం మరో పథకాన్ని కూడా అందిస్తోంది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్లో చేరడం ద్వారా రైతులకు ప్రతి నెలా రూ. 3 వేలు లభిస్తాయి. అంటే ఏడాదికి రూ. 36 వేలు పొందొచ్చు.
6/ 9
అయితే ఈ డబ్బులు పొందాలని భావించే రైతులు నెలకు రూ. 55 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అన్నదాతల వయసు ప్రాతిపదికన చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల వయసులోనే ఈ స్కీమ్లో చేరితే నెలకు . 55 కడితే సరిపోతుంది. గరిష్టంగా రూ. 200 కట్టాల్సి వస్తుంది.
7/ 9
ఇలా ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. లేదంటే బ్యాంక్ అకౌంట్కు ఆటో డెబిట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ప్రతి నెలా ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతూ వస్తాయి.
8/ 9
రైతులకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి నెలా రూ. 3 వేలు వస్తాయి. కాగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కీమ్లో 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు మాత్రమే చేరడానికి ఛాన్స్ ఉంటుంది. దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి ఈ పథకంలో ఉచితంగా చేరొచ్చు.
9/ 9
ఈ పథకంలో చేరిన వ్యక్తి మరణిస్తే.. అప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి వెనక్కి చెల్లిస్తారు. లేదంటే భాగస్వామి ఈ స్కీమ్ను కొనసాగించొచ్చు. స్కీమ్లో వ్యక్తి మరణిస్తే.. భాగస్వామికి రూ.1500 పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణిస్తే.. అప్పుడు నామినీకి కట్టిన డబ్బులు చెల్లిస్తారు.