ప్రస్తుతం పోస్టాఫీసుల్లో ఉన్న పథకాల్లో పెట్టుబడి పెట్టిన డబ్బులకు తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చుకోవచ్చు. అలాంటి పథకాల్లో మరొకటి ఇక్కడ తెలుసుకుందాం. గ్రామీణ ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఇప్పుడు తన గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష యోజన లేదా గ్రామ సురక్ష పథకాన్ని రూపొందించింది. (ప్రతీకాత్మక చిత్రం)
దీని కింద నెలకు రూ.1,500 డిపాజిట్ చేసే పెట్టుబడిదారుడు రూ. 31 నుంచి రూ.35 లక్షల వరకు రిటర్న్ పొందవచ్చు. ఇండియా పోస్ట్ అందించే ఈ ప్రొటెక్షన్ ప్లాన్ తక్కువ రిస్క్తో మంచి రాబడిని అందిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామ సురక్ష యోజన పథకంలో భాగంగా 19 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులుగా పేర్కొన్నారు. ఈ పథకానికి గరిష్ట అర్హత పరిమితి వయస్సు 55 సంవత్సరాలు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో గ్రామ సురక్ష పాలసీలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాలకు రూ.1,515, 58 సంవత్సరాలకు రూ.1,463 మరియు 60 సంవత్సరాలకు రూ.1,411. 55 ఏళ్ల బీమా కోసం మెచ్యూరిటీ ప్రయోజనం రూ. 31.60 లక్షలు కాగా, 58 ఏళ్ల పాలసీకి రూ. 33.40 లక్షలు. 60 ఏళ్ల మెచ్యూరిటీ ప్రయోజనం రూ.34.60 లక్షలుగా ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం)