2. కరోనా వైరస్ మహమ్మారి (Covid 19 Pandemic) కారణంగా దెబ్బతిన్న వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థికంగా అండగా ఉండటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. వీధుల్లో చిన్నచిన్న షాపులు నిర్వహించేవారు, చిరు వ్యాపారులకు రుణాలను అందిస్తోంది. అయితే ఈ పథకంపై అవగాహన లేక చిరు వ్యాపారులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. పీఎం స్వనిధి పథకానికి మొదటిసారి దరఖాస్తు చేస్తే రూ.10,000 రుణం లభిస్తుంది. ఆ రుణాన్ని ఒక ఏడాదిలో తిరిగి చెల్లిస్తే రెండోసారి రూ.20,000 లోన్ తీసుకోవచ్చు. ఇక రెండోసారి కూడా లోన్ సకాలంలో తీర్చేస్తే మూడోసారి రూ.50,000 లోన్ తీసుకోవచ్చు. వార్షిక వడ్డీ 7 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో పేమెంట్స్ చేస్తే వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులు ఎవరైనా ఈ లోన్ తీసుకోవచ్చు. కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్మేవారు, టీ స్టాల్ నిర్వాహకులు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ లాంటి షాపులు నిర్వహించేవారు, ఇలా చిన్న వ్యాపారాలు చేసేవారు ఎవరైనా పీఎం స్వనిధి పథకం కింద రుణాలు తీసుకోవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటీవ్ బ్యంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయక బృందాల బ్యాంకులు ఈ రుణాలు ఇస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. పీఎం స్వనిధి పథకానికి అప్లై చేయడానికి http://pmsvanidhi.mohua.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి I am not a robot పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Request OTP బటన్ పైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్కు వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Verify OTP పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)