1. ప్రభుత్వం ప్రారంభించిన ఏ పథకం అయినా అందులో అనర్హులు బయటపడుతుంటారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో కూడా ఇదే పరిస్థితి. ఒక్క రాష్ట్రంలోనే 21 లక్షల మంది అనర్హులు బయటపడ్డారు. అంటే వారికి పీఎం కిసాన్ డబ్బులు పొందడానికి కావాల్సిన అర్హతలు లేకపోయినా వారి అకౌంట్లో డబ్బులు పడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. పీఎం కిసాన్ స్కీమ్కు సంబంధించి ఉత్తరప్రదేశ్లో 21 లక్షల మందిని అనర్హులుగా గుర్తించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఆదాయపు పన్ను చెల్లించేవారు, సొంత భూమి లేనివారు, భార్యాభర్తలు ఇద్దరూ లబ్ధిదారులుగా ఉన్నవారు... ఇలా కొన్ని నియమనిబంధనల ప్రకారం వారిని అనర్హులుగా గుర్తించినట్టు యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య కుమార్ షాహీ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ 21 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందుతున్నట్టు తేలింది. ఇప్పటికే వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారి నుంచి డబ్బుల్ని రికవరీ చేయనుంది. ఉత్తర ప్రదేశ్లో 2.85 కోట్ల మంది రైతుల్ని లబ్ధిదారులుగా గుర్తిస్తే వారిలో 21 లక్షల మంది అనర్హులే. అంటే సుమారు 7 శాతం మంది అనర్హులే. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు ఏటా రూ.6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ పథకంలోని 12వ ఇన్స్టాల్మెంట్ త్వరలో జమ కావాల్సి ఉంది. అయితే ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైతుల కుటుంబాల్లో గతంలో లేదా ప్రస్తుతం రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు, మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మాజీ లోక్సభ సభ్యులు, ప్రస్తుత లోక్సభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్లు, ప్రస్తుత మేయర్లు, జిల్లా పంచాయతీ ప్రస్తుత ఛైర్పర్సన్స్, మాజీ ఛైర్పర్సన్స్ ఉన్నా పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, విభాగాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, అధికారులు, స్థానిక సంస్థల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు పీఎం కిసాన్ వర్తించదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. పైన చెప్పిన కేటగిరీలో నెలవారీ పెన్షన్ రూ.10,000 కన్నా ఎక్కువ ఉన్న సూపర్యాన్యుయేట్, రిటైర్డ్ పెన్షనర్లు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులకు మినహాయింపు). గత అసెస్మెంట్ ఇయర్లో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు. ప్రొఫెషనల్ బాడీస్లో రిజిస్టర్ అయి ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్. (ప్రతీకాత్మక చిత్రం)