కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందిస్తుండటం తెలిసిందే. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 ఇన్స్టాల్మెంట్లలో డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరగా, ప్రస్తుతం 11వ విడత డబ్బుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు రైతుల ఖాతాలోకి ఇప్పటికే పడాల్సి ఉన్నా, అనూహ్య కారణాల వల్ల అది ఆలస్యమైంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అత్యంత కీలకమైన ఈ-కేవైసీ ఆప్షన్ ను కొంతకాలంపాటు తొలగించిన కేంద్రం.. తిరిగి ఆ సౌకర్యాన్ని తిరిగి అందుబాటులోకి తేవడం తెలిసిందే. ఈ కేవైసీ గడువు ఈనెల 31తో ముగియనుంది (ప్రతీకాత్మక చిత్రం)
పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఫేక్ లబ్దిదారులను జల్లెడపట్టింది. లక్షల సంఖ్యలో తప్పుడు అకౌంట్లను తొలగించింది. వడ పోత ముగిసిన నేపథ్యంలో పీఎం కిసాన్ 11వ విడత సాయం విడుదలకు ఏర్పాట్లు జరిగాయి. పీఎం మోదీ చేతులమీదుగా నిధుల విడుదల కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైతులు ఈ-కేవైసీని అప్ డేట్ చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ డబ్బులు పొందొచ్చు. అందుకు చివరి తేదీని మే31గా నిర్ధారించారు. ఈ కేవైసీ చెక్ చేసుకునే విధానం నంబర్ల వారీగా.. 1. ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వెబ్సైట్పై ( https://pmkisan.gov.in/) తెరవాలి. 2. ఇందులో కుడివైపున ‘ఫార్మర్స్ కార్నర్’ కనిపించనుంది. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
3)బెనిఫిషియరీ స్టేటస్ కొత్త పేజీలో ఓపెన్ అయ్యాక, మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా నంబర్ ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోండి. 4)ఈ మూడు నంబర్ల ద్వారా మీ ఖాతాకు డబ్బు వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. 5)మీరు ఎంచుకున్న ఎంపిక సంఖ్యను నమోదు చేయండి. 6)ఆ తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మొత్తం లావాదేవీ సమాచారాన్ని పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
రైతు కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను (ఐటీ) చెల్లింపుదారులుంటే వారికి పీఎం కిసాన్ పథకం వర్తించదు. అలాగే సాగు భూమి లేని వారిని కూడా పీఎం కిసాన్ యోజన నుంచి మినహాయించారు. తాత లేదా తండ్రి పేరు మీద లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పుడు కూడా రైతులు పీఎం కిసాన్ ద్వారా ప్రయోజనం పొందలేరు. భూమి యజమాని ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికిది వర్తించదు (ప్రతీకాత్మక చిత్రం)
రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు కూడా పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఒక రైతు సంవత్సరానికి రూ. 10,000 పెన్షన్ పొందినట్లయితే, వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. నిబంధనలను అతిక్రమించి పీఎం కిసాన్ సాయం పొందుతున్నట్లు తేలితే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.(ప్రతీకాత్మక చిత్రం)