1. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిందే. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్-జూలై, ఆగస్ట్-నవంబర్, డిసెంబర్-మార్చ్ విడతలకు సంబంధించిన డబ్బులు ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లో జమ అవుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ముందుగా https://www.pmkisan.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Farmers Corner సెక్షన్లో New Farmer Registration పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత గ్రామీణ రైతు అయితే Rural Farmer Registration, పట్టణ రైతు అయితే Urban Farmer Registration సెలెక్ట్ చేయాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రం పేరు సెలెక్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రైతుల పూర్తి వివరాలు, భూమికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అర్హుల జాబితాలో చేరితే ప్రతీ నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున జమ అవుతాయి. పీఎం కిసాన్ 14వ ఇన్స్టాల్మెంట్ విడుదలైన తర్వాత డబ్బులు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముందుగా https://www.pmkisan.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Farmers Corner సెక్షన్లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి. బెనిఫీషియరీ స్టేటస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)