డీజిల్, ఏవియేషన్ ఫ్యూయెల్పై విండ్ఫాల్ ట్యాక్స్ను లీటరుకు రూ. 2 తగ్గించింది కేంద్రం. గ్యాసోలిన్ ఎగుమతులపై సుంకాలను పూర్తిగా తొలగించింది. ఇదివరకు లీటరుకు రూ.6 మే ఈ ట్యాక్స్ ఉండేది. దీంతోపాటే దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడ్ ఆయిల్పై ట్యాక్స్ను 27 శాతం వరకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్లో బుధవారం పెట్రోల్ రేటు లీటరుకు రూ.109.66గా, డీజిల్ రేటు రూ.97.82 గా స్థిరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ లో పెట్రోల్ లీటరు రూ.109.16గా, డీజిల్ రూ.97.98గా ఉంది. ఉంది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ధరలు పెద్దగా మారలేదు. ఏపీ విజయవాడలో పెట్రోల్ రేటు రూ.111.77గా ఉంది. డీజిల్ ధర లీటరు రూ.99.50 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటరు రూ.111.28గా, డీజిల్ ధర రూ.99.87గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు రూ. 96.72గా, డీజిల్ రేటు లీటరుకు రూ. 89.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 111.35, డీజిల్ రూ. 97.28గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో పెట్రోల్ లీటరు రూ. 102.63 గా, డీజిల్ రూ. 94.24గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.101.94గా, డీజిల్ రేటు రూ.87.89గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.36 శాతం తగ్గి, బ్యారెల్కు 106.69 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ రేటు 0.82 శాతం తగ్గి, బ్యారెల్ 99.91 డాలర్లుగా ఉంది. క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నా దేశీ ఇంధన కంపెనీల నష్టాల వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇదిలా ఉంటే, జులై తొలి అర్ధ భాగంలో దేశంలో ఇంధన అమ్మకాలు క్షీణించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ విడుదల చేసిన రిపోర్టులో వెల్లడైంది. వర్షాకాలం సీజన్ ఊపందుకోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. పెట్రోల్ కంటే డీజిల్ అమ్మకాలు భారీగా, 14 శాతం మేరకు పడిపోయాయి. గడిచిన మూడు నెలల్లో ఇంధనం అమ్మకాల్లో తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసారి. ఏవియేషన్ ఫ్యూయెల్ డిమాండ్ కూడా 6.7 శాతం తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)