4. అది కూడా జమ చేసిన మొత్తంలో 25 శాతానికి మించి విత్డ్రా చేయడం సాధ్యం కాదు. అంటే మూడేళ్లలో రూ.3,00,000 జమ చేస్తే అందులో రూ.75,000 మాత్రమే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎన్పీఎస్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న కాలంలో గరిష్టంగా మూడుసార్లు మాత్రమే పాక్షికంగా విత్డ్రాయల్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త రూల్స్ ప్రకారం పాక్షికంగా విత్డ్రా చేసే మొత్తానికి పన్నులు ఉండవు. పిల్లల పైచదువులు, పెళ్లిళ్లు, కొత్త ఇల్లు కొనేందుకు, ఇల్లు నిర్మించుకునేందుకు, తీవ్రమైన అనారోగ్యాలకు చికిత్స కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ నుంచి పాక్షికంగా విత్డ్రా చేయొచ్చు. కరోనా వైరస్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అనారోగ్యంగా గుర్తించినందుకు ఈ కారణంతో కూడా డబ్బులు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏటా రూ.50,000 చొప్పున 30 ఏళ్ల పాటు ఈ స్కీమ్లో పొదుపు చేశాడనుకుందాం. 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.15,00,000 మాత్రమే. వడ్డీ ఏటా 10 శాతం లెక్కేస్తే కానీ 60 ఏళ్ల వయస్సు వచ్చేసరికి అకౌంట్లో రూ.90,00,000 పైనే ఉంటాయి. ఇది వడ్డీ రేటును బట్టి మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. నేషనల్ పెన్షన్ స్కీమ్-NPS స్కీమ్లో జమ చేసిన మొత్తంలో 60 శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు. పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన 40 శాతం నుంచి ప్రతీ నెలా పెన్షన్ లభిస్తుంది. ఈ పెన్షన్ రూ.15,000 పైనే ఉంటుంది. చివర్లో విత్డ్రా సమయంలో వచ్చే మొత్తం, ప్రతీ నెల లభించే పెన్షన్ ఇప్పుడు మీరు జమ చేసేదాన్ని బట్టి మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)