లాక్డౌన్ నేపథ్యంలో అనేక మంది ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆఫీసులు ప్రారంభం అయినా.. పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదు. దీంతో ఎక్కువ మంది ఇంటి వద్దే ఉంటుండడంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరడంతో బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఉపాధి కల్పోయి, వేతనాలు రాక అవస్థలు పడుతున్న అనేక మంది పెరిగిన కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ కింది టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఎల్లప్పుడూ.. అన్ని గదులల్లో లైట్, ఫ్యాన్ వేసి ఉంచవద్దు. రూంలో నుంచి బయటకు వచ్చే సమయంలో లైట్, ఫ్యాన్ ను ఆపేయాలి. అన్నం తినడం, టిఫిన్ చేయడం లాంటి సమయాల్లో ఇంట్లోని అందరూ ఒకే దగ్గర కూర్చోవడం ద్వారా మిగతా చోట్ల లైట్, ఫ్యాన్లు ఆఫ్ చేసి కరెంట్ సేవ్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఇంట్లోనే వ్యక్తుల మధ్య సంబంధాలు కూడా మెరుగు పడతాయి కూడా. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో ఒకటికి రెండు సార్లు లైట్లు, ఫ్లాన్లు, ఏసీలు, హీటర్లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలన్నీ ఆఫ్ చేసి ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రతీ సారి లైట్లు, ఫ్లాన్లపై ఆధారపడొద్దు. ఇంట్లోకి పగటి పూట సహజమైన కాంతి వచ్చే ఛాన్స్ ఉంటే కిటికీలు, తలుపులు తీసి లైట్లను ఆఫ్ చేయడం మంచిది. గాలి కూడా బయట నుంచి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆఫ్ చేయొచ్చు. సాయంత్రం, ఉదయం పూట ఏసీని బంద్ చేసి సహజంగా బయట నుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు మరియు డిజిటల్ కెమెరాలు తదితర వస్తువులకు ఛార్జింగ్ పూర్తయిన అనంతరం ఛార్జర్ లను అలానే వదిలేసి స్విఛ్ ఆఫ్ చేయకుండా ఉంటారు. అలా చేయడం వల్ల విద్యుత్ వృథా అవుతుంది. ఛార్జింగ్ పూర్తయిన వెంటనే ఛార్జర్ ఉంచిన ప్లగ్ కు సంబంధించిన స్విఛ్ ను ఆఫ్ చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)