1. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టూర్లకు వెళ్లలేకపోయారా? ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్కు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) 'గ్రేషియస్ గోవా విత్ హంపి టూర్' పేరుతో గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్లో (Bharat Darshan Tourist Train) పర్యాటకుల్ని హంపి, గోవా లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ గ్రేషియస్ గోవా విత్ హంపి టూర్ 2022 ఫిబ్రవరి 12న ప్రారంభం అవుతుంది. మొదటి రోజు పర్యాటకులు అనకాపల్లి, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్లో రైలు ఎక్కాలి. రెండో రోజు కర్నూలు, గుంతకల్లులో ప్రయాణికులు భారత్ దర్శన్ టూరిస్ట్ ట్రైన్ ఎక్కొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. రెండో రోజు పర్యాటకులు హోస్పేట్ చేసుకుంటారు. అక్కడ హేమకుంట హిల్ ఆలయం, విజయ విఠల, హంపి, శ్రీ విరూపాక్ష ఆలయం సందర్శించొచ్చు. ఆ తర్వాత మడగావ్ బయల్దేరాలి. మూడోరోజు మడగావ్ చేరుకుంటారు. అక్కడ పర్యాటకులు సొంత ఖర్చులతో డోనా పౌలా మండోవి రివర్ క్రూజ్లో ప్రయాణించొచ్చు. రాత్రికి గోవాలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆరో రోజు పర్యాటకులు గుంతకల్ జంక్షన్, కర్నూలు సిటీ, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, ఏలూరు, ఏడో రోజు రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, విశాఖపట్నం, అనకాపల్లిలో రైలు దిగడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ గ్రేషియస్ గోవా విత్ హంపి టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.6,620 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.8,090. (ప్రతీకాత్మక చిత్రం)
7. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, వసతి సౌకర్యాలు, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్ లాంటివి కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)