కరోనా మహమ్మారి షాక్ల నుంచి కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా సంస్కరణలు చేపట్టినప్పటికీ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదాను కోల్పోయింది. తాజా ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం బ్రిటన్ ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. బ్రిటన్ కంటే భారత్ కేవలం 13 బిలియన్ డాలర్లు వెనుకబడి ఉన్నప్పటికీ, ఆర్థిక వృద్ధిలో బ్రిటన్ కంటే చాలా ముందుందని ప్రపంచ బ్యాంకును ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం రెండు ఆర్థిక వ్యవస్థలు 32 ట్రిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నాయి. అయితే 2021 చివరి నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 31.7 ట్రిలియన్ డాలర్లు కాగా బ్రిటన్ జీడీపీ పరిమాణం 31.9 ట్రిలియన్ డాలర్లు. 2021లో,భారతదేశ జిడిపి బ్రిటన్ జిడిపి కంటే కేవలం 13 బిలియన్ డాలర్లు వెనుకబడి ఉంది. 2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ UK కంటే వేగంగా మెరుగుపడింది.(ప్రతీకాత్మక చిత్రం)
జీడీపీ పరిమాణం పరంగా భారతదేశం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండవచ్చు. కానీ మనం కరోనా పూర్వ స్థాయి నుండి ప్రస్తుత రికవరీని పరిశీలిస్తే భారతదేశం పెద్ద జంప్ చేసింది. బ్రిటన్ జిడిపి 2019 స్థాయిల నుండి 2.6 శాతం పెరిగింది. అయితే భారతదేశం 2019తో పోలిస్తే జిడిపిలో 17.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
త్వరలో భారత్ మళ్లీ బ్రిటన్ను అధిగమించి ఐదో స్థానానికి చేరుకుంటుందని ఐసీఆర్ఏ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మళ్లీ దేశంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఇక ఈ జాబితాలో భారత్ కంటే అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు కూడా ముందున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)