హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, విజయవాడ, విశాఖపట్టణంలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.49వేలకు తగ్గింది. చెన్నైలో రూ.49,450, పుణె, పాట్నాల్లో రూ.49,050, అహ్మదాబాద్లో రూ.49,080, జైపూర్, లక్నోల్లో రూ.49,150కి అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంగారం, వెండి ధరల్లో ఎప్పుడు ఒకేలా ఉండవు. నిత్యం మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)