బంగారం ధరలు మళ్లీ మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి పసిడి ధర అమాంతం పెరిగింది. నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.45,550గా ఉంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.450 పెరిగింది. హైదరాబాద్లో ఒక్క గ్రాము బంగారం రూ.4,555కి లభిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.45,550గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,700 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.50వేలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 47,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 49,590 పలుకుతోంది. ప్రతీకాత్మక చిత్రం)
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.47,700గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం రేటు ఎక్కడా లేనంతా రూ.52,040కి చేరింది. కోల్కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,800, 24 క్యారెట్ల బంగారం రేటు 50,500గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.45,550గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం రూ.49,700కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలలో పెరుగుదల, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చలు తగ్గులు ఉంటాయి.(ప్రతీకాత్మక చిత్రం)