Gold Price today: బంగారం ధరలు తగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా... కరోనా కేసులు పెరుగుతుడటం వల్ల అది ఆచరణలోకి రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్ వైపు మరలుతున్నాయి. అందువల్ల బంగారం ధరలు తగ్గాలి. కానీ... కొంతమంది ఇన్వెస్టర్లు... కరోనా మళ్లీ పెరుగుతుందనీ, థర్డ్ వేవ్ వస్తుందనీ... అప్పుడు బంగారంపై భారీ లాభాలు వస్తాయనే అంచనాతో ఉన్నారు. అందువల్ల వాళ్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తొలగించట్లేదు. అందువల్లే బంగారం ధరలు తగ్గాల్సిన సమయంలోనూ సరిగా తగ్గట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. మార్చి 31న 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.41,100 ఉండగా... 124 రోజుల్లో అది రూ.3,890 పెరిగింది. అలాగే... 24 క్యారెట్ల ప్యూర్ పెట్టుబడుల గోల్డ్ 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా... 124 రోజుల్లో అది రూ.4,250 పెరిగింది. దీన్ని బట్టీ... 4 నెలలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
Gold Rates 3-8-2021: నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,499 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.35,992 ఉంది. నిన్న 8 గ్రాముల ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.44,990 ఉంది. నిన్న 10 గ్రాములు ధర స్థిరంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,909 ఉంది. అలాగే 8 గ్రాములు (తులం) రూ.39,272 ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.49,090 ఉంది. నిన్న 10 గ్రాములు ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Silver Price 3-8-2021: వెండి ధర నిన్న కొద్దిగా పెరిగింది. గత 10 రోజుల్లో 5 సార్లు తగ్గగా... 3 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి (మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) వెండి ధర 1 గ్రాము రూ.73.10 ఉంది. అదే... 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.584.80 ఉంది. 10 గ్రాములు కావాలంటే... ధర రూ.731 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,310 ఉండగా... కేజీ వెండి ధర... రూ.73,100 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.100 తగ్గింది. ఏప్రిల్ 1న వెండి ధర కేజీ రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.73,100 ఉంది. అంటే 124 రోజుల్లో వెండి ధర రూ.5,800 పెరిగినట్లు లెక్క. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్ మార్కెట్లు: సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 363 పాయింట్లు బలపడగా... నిఫ్టీ 122 పాయింట్లు బలపడింది. అంటే ఇన్వెస్టర్లకు 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లే. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆగస్టు నెల ప్రారంభం కావడమే. చాలా మంది జీతాలు తీసుకున్నవారు... ఆ డబ్బును స్టాక్ మార్కెట్లలో పెడుతున్నారు. అందువల్ల ఒక్కసారిగా మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. ఇవాళ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నా... భారీగా వెళ్లకపోవచ్చు. ఐతే... అంతర్జాతీయ అంశాల ప్రభావాన్ని బట్టీ... మార్కెట్లలో కదలిక ఉండే అవకాశం ఉంది. చిన్న ఇన్వెస్టర్లు మంచి పేరున్న కంపెనీల షేర్లు కొనుక్కోవడం ఉత్తమ మార్గం అంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)