FOR THE FIRST TIME IN THE COUNTRY THE HARYANA GOVERNMENT HAS MADE IT POSSIBLE TO TAKE RATION GOODS THROUGH ATMS VB
Ration from Atm: ఏటీఎం నుంచి రేషన్ సరుకులు.. దేశంలో తొలిసారి అక్కడ ఏర్పాటు.. వివరాలివే..
Ration from Atm: ఆహార ధాన్యాల కోసం రేషన్ దుకాణాల వద్ద ఇక నుంచి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. హరియాణా ప్రభుత్వం దీని కోసం ఓ ప్రయత్నం చేసింది. బ్యాంకు ఏటీఎం తరహాలో రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో రేషన్ పంపిణీ విధానంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. వన్ నేషన్.. వన్ రేషన్ తో కేంద్ర ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డుతో రేషన్ సరుకులను ఎక్కడైనా తీసుకోవచ్చనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
అంతే కాకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటికి వెళ్లి రేషన్ ను పంపిణీ చేస్తుంది. తాజాగా ఏటీఎం ద్వారా రేషన్ తీసుకునే విధంగా హర్యానా ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది.
3/ 9
దేశంలోనే తొలి 'రేషన్ ఏటీఎం'ను గుడ్గావ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. 5 నుంచి 7 నిమిషాల్లో ఈ ఏటీఎం నుంచి 70 కిలోల వరకు ధాన్యం విడుదలవుతుందని వెల్లడించారు.
4/ 9
ఇక నుంచి ఆహార ధాన్యాల కోసం ఎవరూ కూడా రేషన్ దుకాణాల వద్ద గంటల కొద్ది వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. హరియాణా ప్రభుత్వం గ్రెయిన్ ఏటీఎం(రేషన్ సరకుల ఏటీఎం) ద్వారా వాటిని సరఫరా చేయనుందని స్పష్టం చేశారు.
5/ 9
ధాన్యం ఏటీఎంలతో రేషన్ షాపుల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెరపడుతుందని చౌతాలా అన్నారు. ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని చెప్పారు.
6/ 9
తొలి రేషన్ సరకుల ఏటీఎంను గుడ్గావ్లోని ఫరూక్నగర్లో ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
బ్యాంకు ఏటీఎం లానే రేషన్ సరకుల ఏటీఎం పనిచేస్తుంది. ఇందులో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుంది. టచ్స్క్రీన్ ద్వారా లబ్ధిదారుడు ఆధార్ లేదా రేషన్ ఖాతా నెంబర్ పొందుపరచాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
బయోమెట్రిక్ అథెంటికేషన్ జరగగానే, వారికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్గా సంచుల్లో నింపేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
దీని ద్వారా బియ్యం, గోధుమ, చిరుధాన్యాలు సరఫరా చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)