భారతదేశపు అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) 2021-22లో డెత్ క్లెయిమ్ల కోసం 13.49 లక్షల పాలసీలతో రూ. 28,408 కోట్లు చెల్లించింది. అంతకుముందు సంవత్సరంలో ఇది రూ. 18,295 కోట్లు. ఈ కాలంలో ఐసిఐసిఐ లాంబార్డ్ రూ. 2,977 కోట్లు, హెచ్డిఎఫ్సి లైఫ్ రూ. 2,608 కోట్ల విలువైన క్లెయిమ్లను సెటిల్ చేశాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఆసక్తికరంగా, జీవిత బీమా సంస్థలు FY2022లో కోవిడ్ కారణంగా 1,550 క్లెయిమ్లతో కూడిన రూ. 448 కోట్ల విలువైన క్లెయిమ్లను తిరస్కరించాయి. 41,631 కోట్ల కోవిడ్ క్లెయిమ్లలో, కోవిడ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ క్లెయిమ్ల కోసం సాధారణ మరియు ఆరోగ్య బీమా కంపెనీలు రూ. 24,362 కోట్లు చెల్లించాయి మరియు కోవిడ్ డెత్ క్లెయిమ్ల కోసం జీవిత బీమా సంస్థలు రూ.17,269 కోట్లను కుటుంబాలకు చెల్లించాయి.(ప్రతీకాత్మక చిత్రం)
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకు కోవిడ్ కారణంగా 530,695 మంది మరణించారు. అయితే IRDAI నివేదిక ప్రకారం, 2021-22లో జీవిత బీమా సంస్థలు 2.26 లక్షల మరణ క్లెయిమ్లను సెటిల్ చేశాయి. కోవిడ్ కారణంగా మరణించిన దాదాపు 3.14 లక్షల మందికి బీమా ప్రయోజనాలు లభించలేదని సూచిస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)