ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. డ్యూ డేట్ దాటిన తర్వాత మూడు రోజుల వరకు పేమెంట్ చేయడానికి గడువు ఉంటుందని గుర్తించుకోవాలి. ఈ కాలంలో కార్డు జారీ సంస్థలు బిల్లు మొత్తాన్ని చెల్లించకపోయినా కూడా ఆ విషయాన్ని క్రెడిట్ బ్యూరో సంస్థలకు తెలియజేయకూడదు. మూడు రోజులు దాటితే మాత్రం డ్యూ డేట్ నుంచే చార్జీల వడ్డింపు ఉంటుంది.