2. పెన్షనర్లకు 2022 జూలై 1 నుంచి పెరిగిన 4 శాతం డీఆర్ వర్తిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DOPPW) ఆఫీస్ మెమొరండం విడుదల చేసింది. ప్రస్తుతం 34 శాతంగా ఉన్న డియర్నెస్ రిలీఫ్ 38 శాతానికి పెంచాలని రాష్ట్రపతి నిర్ణయించారని, పెరిగిన డీఆర్ 2022 జూలై 1 నుంచి వర్తిస్తుందని DOPPW ఆఫీస్ మెమొరండంలో తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. పెరిగిన డీఏ, డీఆర్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా డీఏ, డీఆర్ పెంచుతుంది. ప్రతీ ఏటా జనవరి, జూలైలో డీఏ, డీఆర్ పెరుగుతుంది. ప్రస్తుతం 2022 జూలైకి సంబంధించిన డీఏ, డీఆర్ పెరిగింది. 41.85 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల పెన్షనర్లకు డీఏ, డీఆర్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. డీఆర్ ఏ పెన్షనర్లకు వర్తిస్తుందో DOPPW ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అందులోని సమాచారం ప్రకారం సాయుధ దళాల పెన్షనర్లు, రక్షణ సేవకు చెందిన సివిలియన్ పెన్షనర్లు, ఆల్ ఇండియా సర్వీస్ పెన్షనర్లు, రైల్వే పెన్షనర్లు, వారి కుటుంబ పెన్షనర్లు, తాత్కాలిక పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు ఈ పెన్షన్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రమోషన్కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ని నిర్దేశించిన నిబంధనలను సవరించింది. ప్రమోషన్ కోసం అవసరమైన కనీస అర్హత సేవను సూచించే నిబంధనలను సవరించాలని నిర్ణయించినట్టు DoPT తెలిపింది. ఈ విధివిధానాలను అనుసరించిన తర్వాత రిక్రూట్మెంట్ రూల్స్, సర్వీస్ రూల్స్లో సవరణలను చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏడో పే కమిషన్ పే మ్యాట్రిక్స్లోని లెవెల్ 1, లెవెల్ 2 ఉద్యోగులకు ప్రమోషన్ కావాలంటే కనీసం మూడేళ్ల సర్వీస్ ఉండాలి. అలాగే లెవెల్ 6 నుంచి లెవెల్ 11 లోని ఉద్యోగులకు కనీసం 12 ఏళ్ల సర్వీస్ ఉండాలి. అయితే లెవెల్ 7, లెవెల్ 8 ఉద్యోగులకు ఇది రెండేళ్లు మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)