1. కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం (Central Government) ఈ నెలాఖరులోగా కీలక నిర్ణయం తీసుకోనుంది. డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) పెంపుతో పాటు డీఏ బకాయిల్ని విడుదల చేయనుంది. ఈసారి 3 శాతం డీఏ పెరుగుతుందని అంచనా. ఇదే జరిగితే 34 శాతం డీఏ అందుకోనున్నారు ఉద్యోగులు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. ప్రతీ ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏ పెరుగుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడల్లా పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (Dearness Relief) కూడా పెరుగుతుంది. 2022 జనవరికి సంబంధించిన డీఏ, డీఆర్ పెరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం హోళీ సందర్భంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. జనవరి డీఏ 3 శాతం పెరిగితే 34 శాతం డీఏ లభించనుంది. అంటే రూ.18,000 బేసిక్ వేతనం ఉన్నవారికి రూ.73,440 వార్షిక డీఏ లభిస్తుంది. గరిష్టంగా వార్షికంగా రూ.2,32,152 డీఏ లభించే అవకాశం ఉంది. బేసిక్ వేతనాన్ని బట్టి డీఏ లెక్కిస్తారు కాబట్టి బేసిక్ వేతనం ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ డీఏ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. AICPI డేటాను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ డేటా ప్రకారం 3 లేదా 4 శాతం డీఏ పెరగొచ్చు. ఈసారి 3 శాతం డీఏ పెంచుతారని అంచనా. ఇక ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు 18 నెలల డీఏ బకాయిలు రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)