1. డియర్నెస్ అలవెన్స్ పెంపు (DA Hike) కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. డీఏ పెంపుతో పాటు డీఏ బకాయిల (DA arrears) విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 31 శాతం డీఏ పొందుతున్నారు. మరో 3 శాతం డీఏ పెరగనుందని అంచనా. 2022 జనవరికి సంబంధించిన డీఏ ఇది. డీఏ 3 శాతం పెరిగితే ఇక ఉద్యోగులకు 34 శాతం డీఏ లభించనుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం జనవరి 26న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజున కాకపోయినా ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సార్లు ఉద్యోగులకు డీఏ పెంచుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ కూడా పెరుగుతుంది. డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ డేటా ప్రకారం 3 శాతం లేదా 4 శాతం డీఏ పెంచుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక 2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం, 18 శాతం, 9 శాతం చొప్పున హౌజ్ రెంట్ అలవెన్స్ (HRA) ప్రకటించింది ప్రభుత్వం. ఈ శ్లాబ్స్ ఉద్యోగులు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఉద్యోగులకు డీఏ పెరిగితే అందుకు తగ్గట్టుగా హెచ్ఆర్ఏ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. డీఏ పెంపు, హెచ్ఆర్ఏ పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త రానుంది. ఉద్యోగులు డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం డీఏ, డీఆర్, 2020 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు 3 శాతం డీఏ, డీఆర్, 2021 జనవరి నుంచి 2021 జూలై వరకు 4 శాతం డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. డీఏ బకాయిల విడుదలపైనా కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం రూ.34,402 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో జమ కానున్నాయి. లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు విడుదలవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)