Puri Rath Yatra 2021: ఈ సంవత్సరం జులై 12న (సోమవారం) పూరీ జగన్నాథ రథయాత్ర జరపాలని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA) నిర్ణయించడంకో... ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా.... మినియేచర్ ఆర్టిస్ట్ ఎల్ ఈశ్వర్ రావు... జగన్నాథ స్వామి, సుభద్రా దేవి, బలభద్రస్వామి రథాలను వేప పుల్లలతో తయారుచేశారు. ఇందుకోసం మొత్తం 435 పుల్లల్ని వాడారు. రథాలు, లోపల ఇష్టదైవాల ప్రతిమల్ని తయారుచేశారు. ANI న్యూస్ ఏజెన్సీ పోస్ట్ చేసిన ఈ ఫొటో వైరల్ అయ్యింది. ఈశ్వరరావు టాలెంట్ను అంతా మెచ్చుకుంటున్నారు. (Image credit - twitter - ANI)
గతేడాది సాదాసీదాగా జరిగిన రథయాత్ర... ఈ సంవత్సరం కూడా భక్తులు లేకుండానే జరుగుతుంది. ఆలయ పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ... RT-PCR టెస్టులు చేస్తారు. లేదా వారు 2 వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నవారై ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్ విధిగా పాటించాలని సీఎం నవీన్ పట్నాయక్ కోరారు. ఇండియాలో కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాబట్టే భక్తుల్ని అనుమతించట్లేదని SJTA తెలిపింది. (Image credit - twitter - ANI)
జులై 12న ఉదయం 8-30కి రథయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 నుంచి రథాలను లాగే కార్యక్రమం మొదలవుతుంది. జులై 23న దేవతామూర్తులను తిరిగి ప్రధాన ఆలయానికి తీసుకొస్తారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఉంటుంది. ఆలయ అధికారుల ప్రకారం... జులై 25న నుంచి ఆలయానికి భక్తులను అనుమతిస్తారు. (Image credit - twitter - ANI)