పూజా విధానం : మహా శివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి, పైన బిల్వ పత్రాలు, పువ్వులు, బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి. మీరు నివసించే సమీపంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజించాలి. ఈ సమయంలో శివుని పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.