ఉపాధ్యాయ దినోత్సవం లాగా జగన్ బర్త్ డే రోజున ఏపీలో ప్రత్యేక దినోత్సవం
ఉపాధ్యాయ దినోత్సవం లాగా జగన్ బర్త్ డే రోజున ఏపీలో ప్రత్యేక దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సంఘం నిర్ణయం తీసుకుంది. వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో కేవలం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని వెంకట్ రామ్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సంఘం నిర్ణయం తీసుకుంది.
2/ 5
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సమావేశమై నూతన కమిటీ ఇటీవల ఎంపికైంది. కమిటీ గౌరవ అధ్యక్షులుగా వెంకట్ రామ్ రెడ్డి, అధ్యక్షుడిగా జి.వి. రాఘవరెడ్డి, జనరల్ సెక్రెటరీగా అంకమ్మ రావు సహా 30 మందితో కమిటీ ఏర్పాటు అయింది.
3/ 5
వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో కేవలం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని వెంకట్ రామ్ రెడ్డి అన్నారు. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోగల నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని ఆయన అన్నారు.
4/ 5
సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇంటి ముందే అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు.
5/ 5
సీఎం జగన్ జన్మదినం డిసెంబర్ 21వ తేదీని గ్రామ వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించామని ఆయన అన్నారు.