Weekly Pooja: హిందువులు కేవలం పండగలప్పుడు.. ప్రత్యేక రోజుల్లోనే కాదు.. ప్రతి నిత్యం దేవుడ్ని ఆరాధించాలి అనుకుంటారు. ముఖ్యంగా మహిళలు అయితే నిత్యం దేవుళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఏ రోజు ఏ పూజ చేయాలి? ఏ పూజ చేస్తే పుణ్యఫలితం వస్తుంది. ఏ దేవునికి ఏ వారం ప్రీతికరం ఈ విషయాలు తెలిసినవే అయినా కొన్ని ఆనుమానాలు ఉంటాయి. అయితే శాస్త్రంలో ఏ రోజు ఏ దేవునికి పూజిస్తే మంచిదో పలు సందర్భాల్లో వివరించింది. శివపురాణంలో 14వ అధ్యాయంలో దేవతల ప్రీతికోసం ఐదురకాలైన పూజల గురించి పేర్కొంది.
ఆదివారం:
ఆదిత్యుని, ఇతర దేవతలను పూజించి పండితులను సత్కరించడం లేదా వారికి భోజనపదార్థాలను దానం చేయడం లాంటివి చేస్తే మంచివి. దీని కారణంగా కంటిరోగాలు, తలకు సంబంధించిన సమస్యలు, కుష్టువ్యాధి, దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయి.. దీని ద్వారా ఉపశమనం కల్గిస్తాయి. ఆదివారం సూర్యారాధన వల్ల ఆరోగ్యంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
సోమవారం:
సోమవారం అంటే చంద్ర సంబంధ వారం. సోముడు అంటే శివునికి సంబంధించిన లేదా ప్రీతికరమైన రోజు. అంతేకాదు లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైన రోజు సంపద కోసం అయితే శివుడు లేదా లక్ష్మీ ఆరాధన చేయాలి. అభిషేకం, కుంకుమార్చన చేస్తే చాలా మంచిది అని చెబుతున్నారు. అదేవిధంగా వైష్ణవ సంప్రదాయం వారు అయితే వేంకటేశ్వరుడికి అభిషేకం లేదా పుష్పార్చన చేస్తే విశేష ఫలితం వస్తుంది.ఈ రోజు పండితులకు లేదా ఎవ్వరికైన నెయ్యితో భోజన పదార్థాలను ఇస్తే మంచి జరుగుతుంది.
మంగళవారం: ఆంజనేయస్వామికి, గణపతికి ప్రత్యేక సందర్భాలలో, దుర్గాదేవికి ప్రీతికరమైన రోజు. ఆరోగ్య సమస్యలు తగ్గేందుకు మంగళవారం కాళీ దేవతను పూజిస్తే మంచిది అంటారు. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆంజనేయస్వామికి వడమాల, తమలపాకులతో అర్చన చేస్తే భయాలు, రోగాలు పోతాయని శాస్త్ర చెబుతోంది.
శుక్రవారం:
లక్ష్మీదేవికి, అమ్మవార్లు అంటే దుర్గా, కాళీ, లలితా, కామాక్షీ, మీనాక్షీ లాంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది. అదేవిధంగా తులసీపూజ, గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించాలి. ఈ రోజు పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి.
శనివారం:
శనివారం అంటేనే కలియుగ దైవం వేంకటేశ్వరుడికి ప్రీతికరం. అదేవిధంగా ఆంజనేయస్వామి, శనిదేవతల ఆరాధన ఉత్తమం. తప్పక హనుమాన్ లేదా రుద్ర సంబంధ అంటే శివాలయాలు, వేంకటేశ్వర ఆలయా సందర్శన, ప్రదక్షణలు సకల దోషాలను పోగొడుతాయి. శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి. అలా చేస్తే.. పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శని దోష పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు.