TTD TO RELEASE OFFLINE FREE DARSHAN TOKENS FROM FEBRUARY 16TH FULL DETAILS HERE PRN TPT
Good News: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లకు రంగం సిద్ధం.. ఎప్పటి నుంచంటే..!
సామాన్య భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్ల (Tirumala Darshan Tokens) పై కీలక ప్రకటన చేసింది.
సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఆఫ్ లైన్లో సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
2/ 6
ప్రస్తుతం టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవ, వీఐపీ సిఫార్సులు, ఆన్ లైన్ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ మేరకు రోజుకు 25వేల నుంచి 30 వేల మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
3/ 6
తాజాగా ఈనెల 16వ తేదీ నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. రోజుకు పదివేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని.. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులు టికెట్లు తీసుకోవచ్చని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
4/ 6
కరోనా తగ్గుముఖం పట్టడంతో సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను పెంపొందించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలో రోజుకు పది వేలు చొప్పున తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాంమని ఆయన తెలియజేశారు.
5/ 6
ఉదయాస్తమాన సేవకు సంబందించిన సాఫ్ట్వేర్ సిద్దం చేశామన్న జవహర్ రెడ్డి. ఈ నెల 16వ తేదీన ఉదయం 9:30 నిమిషాల నుండి వెబ్ సైట్ లో విడుదల చేస్తాంమని ఆయన వెల్లడించారు. చిన్న పిల్లల ఆసుపత్రికి విరాళాలు ఇచ్చే దాతలు ఉదయాస్తమాన సేవ దర్శనం కల్పిస్తాంమని గతంలోనే చెప్పినట్లు జవహర్ రెడ్డి తెలిపారు.
6/ 6
దాతలు ముందుకు వచ్చి ఉదయాస్తమాన సేవను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్జిత సేవల పునరుద్దరణపై మార్చి నెలలో జరుగబోయే టిటిడి బోర్డు మీటింగ్ లో చర్చిస్తాంమని, ఆర్జిత సేవల విషయంలో బోర్డు మీటింగ్ లో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.