Tollywood on AP Floods: ఏపీలో వరదలపై స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ సాయం..
Tollywood on AP Floods: ఏపీలో వరదలపై స్పందించిన టాలీవుడ్.. చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ సాయం..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) వరద బాధితులకు సాయం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలు వరదల ధాటికి అతలాకుతలమయ్యాయి. భారీ ప్రాణనష్టంతో పాటు వేలకోట్ల రూపాయల ఆస్తినష్టం కూడా సంభవించింది. (File: Photo)
2/ 6
ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల వల్ల రూ.6,054 కోట్లు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇళ్లు కూలిపోవడం, పంటలు దెబ్బతినడంతో లక్షలాది మంది రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. (File: Photo)
3/ 6
ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ముందుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు వరద బాధితులకు సాయం ప్రకటించారు.
4/ 6
వరద బాధితుల కోసం రూ.25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఏపీలో ఇటీవల సంభవించిన వరదలు ఎంతో బాధించాయని.. బాధితులకు అండగా తన వంతు సాయంగా రూ.25 లక్షలు సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు చిరు ట్వీట్ చేశారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా రూ.25 లక్షలు సాయాన్ని ప్రకటించారు.
5/ 6
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరద బాధితులకు తన వంతుగా రూ.25 లక్షల సాయాన్ని ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు తనను చలించేలా చేశాయని.. తాను చేసే చిన్నసాయం బాధితులకు ఉపయోగపడుతుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
6/ 6
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన వంతు సాయంగా రూ.25లక్షలు ప్రకటించారు. సంక్షోభంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సాయం చేయాలని మహేష్ ట్వీట్ చేశారు.