ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతిస్తామని టీడీపీ ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. (ప్రతీకాత్మకచిత్రం)
గతంలోనే టీటీడీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ ను తప్పనిసరి చేసింది. కానీ కొంతమంది భక్తులు నెగెటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది అలాంటి భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో భక్తలు ఇబ్బందులకు గురవుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికేట్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)