TTD Alert: కలియుగ వైకుంఠం తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకు భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా 300 ఎస్ఇడి టికెట్లు 2 లక్షలు కేటాయించారు. అలాగే సర్వదర్శనం టోకెన్లు కూడా విడుదల చేస్తున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు.
ప్రత్యేక దర్శనం, బ్రేక్ దర్శనం అవకాశం లేని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని ఈ సర్వదర్శనం టోకెన్లు పొందవచ్చు.. జనవరి 1వ తేదీని సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలోనే.. తొమ్మిది వేర్వేరు ప్రాంతాల్లో సర్వదర్శనం టోకెన్లను ప్రత్యేకంగా జారీ చేస్తామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
తిరుపతిలో అలిపిరి దగ్గర గల భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుక గల 2,3 సత్రాలు, ఆర్టిసి బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జడ్పి హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి దగ్గర ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో అందించనున్నారు.
భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. తిరుమలలో వసతి సౌకర్యం తక్కువగా ఉన్నందున దర్శన టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే ముందు వచ్చిన వారికే ముందు అన్న ప్రాతిపదికపై వసతి సౌకర్యం కల్పిస్తామని సింఘాల్ చెప్పారు.
ఈవో వెంట వెంట అదనపు ఈవో(ఎఫ్ఏసి) శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్రెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ట్రాన్స్ పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి తదితరులు ఉన్నారు.