Viral Photo: ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రముఖులుగా ఉన్నవారి..? చిన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి.. ఎవరో గుర్తు పట్టారా అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇప్పుడు సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..?
ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా మంచి క్రేజ్ ఉన్న నేతలు.. స్టార్లు.. చిన్నప్పటి ఫోటోలు పెడుతూ.. ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారో తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటిదే ఈ ఫోటో కూడా.. అయితే ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. అందరి స్టార్ హీరోలతో హిట్ లు కొట్టింది.. ఇప్పుడు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా.. మంత్రిగా కొనసాగుతున్నారు.
ఇప్పటికే ఎవరో గుర్తు పట్టి ఉంటారుగా.. అవును మీ ఊహ నిజమే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి రోజా సెల్వమణీనే.. రోజా పుట్టిన రోజు సందర్భంగా ఈ చిన్నానాటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక రోజా గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం అవసరం లేదు. అయినా ఆమె గురించి తెలియని కొన్ని విషయాలు ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాయి.
ఇక బుల్లితెరపై ఆమె నిర్వహించిన కార్యక్రమాలు సైతం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయనే చెప్పవచ్చు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఆమెకు.. రాజకీయంగా సరైన గుర్తింపు దక్కింది మాత్రం ఇప్పుడే.. ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖమంత్రిగా రోజా ప్రస్తుతం సాగుతున్నారు. మంత్రి అయిన తరువాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇదే..
తమిళంలో ఆర్.కె.సెల్వమణి దర్శకత్వంలో రోజా నటించిన ‘చెంబరుతి’ మంచి విజయం సాధించి, ఆమెకు నాయికగా పేరు సంపాదించి పెట్టింది. తెలుగులో “సర్పయాగం, సీతారత్నంగారి అబ్బాయి, ముఠా మేస్త్రీ, పోలీస్ బ్రదర్స్, అన్న, శుభలగ్నం, ముగ్గురు మొనగాళ్ళు, ఘటోత్కచుడు, అన్నమయ్య, సంభవం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా” వంటి చిత్రాలలో అలరించారు రోజా.
ఇక బాలకృష్ణతో రోజా జోడీ కట్టిన “భైరవద్వీపం, బొబ్బిలిసింహం, శ్రీకృష్ణార్జున విజయం, పెద్దన్నయ్య, సుల్తాన్” చిత్రాలలో నటిగా మురిపించారామె. ‘స్వర్ణక్క’ సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు రోజా. ఇప్పటికీ అడపా దడపా తెరపై కనిపిస్తూనే ఉన్నారామె. ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ‘జబర్దస్త్’ కార్యక్రమం విశేషంగా అలరిస్తోంది. ‘బతుకు జట్కా బండి’ వంటి కార్యక్రమాల్లోనూ రోజా తనదైన బాణీ పలికించారు.
‘చెంబరుతి’తో తనకు మంచి పేరు సంపాదించి పెట్టిన దర్శకుడు సెల్వమణిని రోజా వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీకి చెందిన ‘తెలుగు మహిళ’కు అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ పార్టీ టిక్కెట్ పై 2009లో చంద్రగిరి నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి నెలకొల్పిన వైసీపీలో చేరారు.
2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుండి వై.సి.పి. టిక్కెట్ పై గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్టర్ కార్పోరేషన్ ఛైర్ పర్సన్ గా రెండేళ్ళు ఉన్నారు. పంచులు దంచడంలో మేటి అనిపించుకున్న రోజా, రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఏపీ స్టేట్ మినిస్టర్ గానూ రోజా తనదైన పంథాలో సాగుతున్నారు.