శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో వచ్చే వీఐపీల కోసం కొద్దీ సంవత్సరాల క్రితం టీటీడీ ప్రత్యేక బ్రేక్ దర్శనాలను ఏర్పాటు చేసింది. మొదట ప్రతి రోజు ఉదయం, సాయంకాల సమయంలో బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చే వీఐపీలు.. వివిఐపిలను వారు సిపార్సు చేయబడిన వారికి ప్రత్యేక బ్రేక్ దర్శనాలు కేటాయించి వారిని దర్శనానికి అనుమతించే వారు.
కాలక్రమేణా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘనీయంగా పెరడంతో సామాన్య భక్తులకు అధిక సమయం శ్రీవారి దర్శన భాగ్యం కేటాయించాలన్న సంకల్పంతో అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో శుక్ర, శని, ఆదివారాల్లో సాయంకాలం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దీంతో వారాంతంలో భక్తుల రద్దీ పెరిగిన బ్రేక్ దర్శనాల రద్దుతో రోజులు సగటున 15 వేల మందికి పైగా సామాన్య భక్తులకు అదనంగా దర్శనభాగ్యం కలిగింది.
సామాన్య భక్తుల దృష్ట్యా ఎనిమిదేళ్ల క్రితం బ్రేక్ దర్శన విధానంలో భారీ మార్పులను తీసుకొచ్చింది టీటీడీ. ముందుగా వారాంతం రోజులలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ క్రమేణా గురువారం మినహా మిగిలిన అన్ని రోజులలో సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. సాయత్రం బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి ఉదయం పూట మాత్రమే బ్రేక్ దర్శనాలు అమలు చేసింది టీటీడీ.
ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకి అదనంగా మూడు గంటల పాటు స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. గత ప్రభుత్వ హయంలో విఐపి బ్రేక్ దర్శనాలలో మూడు విధానాలను ప్రవేశ పెట్టారు. ఎల్ 1,ఎల్ 2 ,ఎల్ 3 విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో టికెట్ ధర మాత్రం అందరికి 500 రూపాయలే అయినా స్వామి వారి ముందు ఒక్కొక్కరికి ఒక్కోలా దర్శనం చేయించేవారు. ఈ విధానంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
తీవ్ర విమర్శల నేపథ్యంలో ఎల్ 1, ఎల్ 2 , ఎల్ 3 దర్శనాలపై కోర్టులో ప్రజా ప్రయోజనాలవాజ్యం వేసారు.. ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాల పేరుతో రోజు వేలాది విఐపి దర్శన టికెట్లు ను కేటాయించేవారు. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారో తెలియజేయాలని టీటీడీ ఈవోను హైకోర్టు ఆదేశించింది.
రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశముంది.
రాత్రంతా క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో టీటీడీ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు సాగె విఐపి బ్రేక్ దర్శన టైమింగ్స్ లో మార్పులు తీసుకురానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12ల వరకు బ్రేక్ దర్శనాల సమయంలో మార్చు చేయనున్నారు.
మరోవైపు నేటి నుంచి మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తారు.