అంజలి శర్వానికి చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువగా ఉండడంతో ఏ క్రీడల్లోనైనా చురుగ్గా పాల్గొనేది. పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో పాల్గొని తన నిరూపించుకునేది. అలా అథ్లెటిక్స్ పరుగు పందెం తో పాటు లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ పోటీల్లో 40 కి పైగా పథకాలు సాధించింది అండర్ 16 జాతీయ పోటీల్లోనూ పాల్గొని తన ప్రతిభను కనబరిచింది.
ఆదోని పట్టణంలోని స్థానిక మిల్టన్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అంజలి శర్వాణి పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో అంజలి శర్వాణి తల్లిదండ్రులు కూడా ఆమెకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అలా క్రీడలపై ఎక్కువగా ఆసక్తి ఉండడంతో ఇంటర్లో మాత్రం ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఇంటర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యింది. అప్పుడు మాత్రం చాలామంది ఆమెను విమర్శించారు.
అమ్మాయిలకు చదువే ముఖ్యం ఆటలాంటుతిరిగితే ఉద్యోగం వస్తుందా భవిష్యత్తు పాడవుతుంది. ఇకనైనా చదువు మీద దృష్టి పెట్టించు అని అంజలి శర్వాణి తండ్రి రమణ రావుకు చాలామంది చుట్టుపక్కల వారు చెప్పకు వచ్చారు. ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవకాశాలు రాకపోతే తన భవిష్యత్తు ఏమవుతుందోనని కంగారుపడిన సమయంలో అంజలి శర్వాణి తల్లిదండ్రులకు ఉద్యోగం కోసం మనం వెతుక్కుంటూ వెళ్లడం కాదు ఉద్యోగమే మన కోసం వెతుక్కుంటూ వస్తుందని ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి రైల్వేలో ఉద్యోగం సంపాదించింది.
గత ఏడాది సీనియర్ టి20 ట్రోఫీలో పది మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి శభాష్ అనిపించుకుంది. ఆ రెండు నెలల వ్యవధిలో 20 మ్యాచ్ ల్లో 30 వికెట్లు పడగొట్టి తన ప్రతిభను కనబరిచి అందరినీ ఆకట్టుకుంది. అలా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడంతో అంజలి శర్వాణి క్రికెట్ వైపు అడుగులు వేసి అంచలంచలుగా ఎదిగి భారత జట్టుకు ఎంపికై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.