ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే పవన్ ఏపీలో ఇసుక కొరతపై ఆందోళన చేస్తున్నారు. ఇసుక కొరతతో రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిరసనలు చేపడుతున్నారు. విశాఖలో ఇటీవలే పవన్ లాంగ్ మార్చ్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో నెలకొన్న ఇసుక సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు జనసేనాని. ఈ సమావేశంలో భవన నిర్మాణా కార్మికుల ఆత్మహత్యలపై కూడా పవన్ .. గవర్నర్కు వివరించినట్లు సమాచారం.