తాజాగా వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఒడిశా-ఏపీ తీరం మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమం ఛత్తీస్ గఢ్, ఒడిశా, మహారాష్ట్ర వైపు కదులుతోంది. రెండు రోజుల క్రితం వరకు ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట వైపు కదిలిన అల్పపీడనం.. భూమిపైనే ఎక్కువగా కొనసాగుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇది నాలుగైదు రోజుల పాటు అల్పపీడనంగానే కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుగ్గా కదుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయి. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కుంభవృష్టి కురిసే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.