13ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయిస్తోంది. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కింది. ఆమె పోలీసులకు చిక్కిన తర్వాత మృగాళ్లు ఆ బాలికను వదల్లేదు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మేడికొండూరు ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మకచిత్రం)
గుంటూరులోని స్వర్ణభారతి నగర్ కు చెందిన సదరు మహిళ ఓ సినిమాను కూడా నిర్మిస్తోందట. బాలికను బలవంతంగా తీసుకెళ్లిన నిందితురాలు ఆమెను బెదిరించి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. ఐతే మహిళ నుంచి బాలిక తప్పించుకోవడంతో విషయం బయటకు రాకుండా మిస్సింగ్ కేసును మాఫీ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మకచిత్రం)
నిందితురాలు పట్టుబడినా బాధిత బాలికను మాత్రం కొందరు ముఠా సభ్యులు వేర్వేరు ప్రాంతాలకు తిప్పి వ్యభిచారం చేయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే సదరు బాలిక ఓ మాజీ ఎంపీకి బంధువని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాలికను రక్షించిన పోలీసులు ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. (ప్రతీకాత్మకచిత్రం)