ఏపీ సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్తో వైఎస్ జగన్ సమావేశం దాదాపు గంటపాటు సాగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. రేపు ఉదయం 9 గంటలకు సీఎం జగన్ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో సీఎం జగన్ భేటీ కానున్నారు. షెకావత్తో పోలవరం ప్రాజెక్టు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై సీఎం జగన్ చర్చించనున్నారు.