మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను సీఎం జగన్ శనివారం ప్రారంభించారు.
2/ 7
మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు.
3/ 7
కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
4/ 7
ఒక్కో స్టేషన్లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు.
5/ 7
దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించారు.
6/ 7
దిశ పోలిస్ స్టేషన్ ఏర్పాటు అనేది ఓ విప్లవాత్మక నిర్ణయమని సీఎం జగన్ అన్నారు.
7/ 7
ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.