ఆంధ్రప్రదేశ్లోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
2/ 6
హైస్కూళ్లలో ఉదయం 8 నుంచి 8.45 వరకు విద్యార్థులకు సెల్ఫ్ లెర్నింగ్, సూపర్ అడ్వైజరీ స్టడీ క్లాస్, సాయంత్రం 4 నుంచి 5 వరకు గేమ్స్, స్పోర్ట్స్ సెక్షన్లు ఉంటాయి.
3/ 6
వీటికి ఆయా స్కూళ్ల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు, ఎస్ఏ (పీడీ)లు తప్పని సరిగా హాజరుకావాల్సి ఉంటుంది.
4/ 6
దీంతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు హాజరు మినహాయింపు కల్పించారు.
5/ 6
కానీ విద్యార్థులు మాత్రం అన్ని క్లాసులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2021-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది.
6/ 6
అందులో క్లాసుల వారీగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు స్కూళ్లు కొనసాగుతాయని తెలిపింది.