ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 29,838 టెస్టులు నిర్వహించగా... 3,396పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జిల్లాలో కూడా రోజు వారీ కేసుల సంఖ్య 600 దాటలేదు. రెండు జిల్లాల్లో వందలోపే కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం జిల్లాలో 147, చిత్తూరు జిల్లాలో 252, తూర్పుగోదావరి జిల్లాలో 516, గుంటూరు జిల్లాలో 360, కడప జిల్లాలో 204, కృష్ణా జిల్లాలో 494, కర్నూలు జిల్లాలో 205, నెల్లూరు జిల్లాలో 197, ప్రకాశం జిల్లాలో 240, శ్రీకాకుళం జిల్లాలో 46, విశాఖపట్నం జిల్లాలో 281, విజయనగరం జిల్లాలో 56, పశ్చిమ గోదావరి జిల్లాలో 398 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.