ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ దారులకు శుభవార్త. ఆగస్ట్ 1 నుంచి వారికి పింఛను మొత్తం పెరగనుంది.
ప్రస్తుతం నెలకు రూ.2250 పింఛను వస్తుంది. వచ్చే నెల నుంచి రూ.2500 అందనుంది.
వృద్దులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఈ మొత్తం గ్రామ, వార్డు వాలంటీర్లు అందజేస్తారు.
తాము అధికారంలోకి వస్తే పించను సొమ్మును రూ.2000 నుంచి ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
ఆ ప్రకారం జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ క్రమంలో ఆగస్ట్ నుంచి పింఛను మొత్తం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
...