ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్తపథకాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా (Rythu Bharosa), నష్టం వచ్చిన సీజన్ లోనే పరిహారం, వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేయనుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు ఇస్తామని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. (ప్రతీకాత్మకచిత్రం)
అందుకు తగినట్లుగానే రైతు రథం (Rythu Ratham) పేరుతో అన్నదాతలకు ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారు. జూన్ 6న తేదీన రైతు రథం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వంతెలిపింది. అదే రోజున రైతులకు 6వేల ట్రాక్టర్లను పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)
రైతు రథం కింద ట్రాక్టర్ పొందడానికి ముందుగా గ్రామంలోని చిన్న, సన్నకారురైతులు ముగ్గురికి తగ్గకుండా ఒక గ్రూప్ గా ఏర్పడి ఆ గ్రూపుకి ఒక పేరు పెట్టుకోవాలి. ప్రతి రైతు తమ పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ ను రైతు భరోసా కేంద్రంలో అందించాలి. ఆ తర్వాత గ్రూప్ పేరుమీద బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేసి గ్రూప్ కి లింక్ చేయించాలి. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ ప్రక్రియ మొత్తం జూన్ రెండు లోపల పూర్తి చేసుకున్నట్లైతే దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారికీ రైతు రథం పథకం క్రింద ఎంపిక చేస్తారు. రైతులు ఎంపిక చేసుకున్న ట్రాక్టర్ వివరాలను కూడా అందిస్తే సబ్సిడీ మొత్తాన్ని రైతు గ్రూప్ అకౌంట్ కు పంపుతారు. రైతులు మిగిలిన మొత్తాన్ని చెల్లించి ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)