ఉక్రెయిన్ యుద్ధం (Ukraine) ఎఫెక్ట్ తో మనదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ వంట నూనెల ధరలు (Cooking oil Price) చుక్కలనంటున్నాయి. చాలా చోట్ల వ్యాపారులు నూనెను బ్లాక్ చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలుచోట్ల విజిలెన్స్ అధికారులు దాడులు చేసి భారీ సంఖ్యలో నూనెను సీజ్ చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
మున్సిపల్ మార్కెట్లు, సూపర్ బజార్లలో ప్రభుత్వ ఔట్లెట్ల ద్వారా వంట నూనెల విక్రయాలను పెంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. వంట నూనెల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం నియమించిన రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ ఇటీవల భేటీ అయి చర్చించింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఏపీ ఆయిల్ఫెడ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 150 కియోస్క్ లు ఏర్పాటు చేయనన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 111 మున్సిపాలిటీలు, 34 కార్పొరేషన్లలో వంట నూనెల విక్రయాలకు కియోస్క్లనుఏర్పాటు చేస్తారు. ఇవన్నీ స్వయం సహాయక బృందాల ద్వారా ఆయిల్ఫెడ్ ఉత్పత్తులను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం సన్ఫ్లవర్ నూనె లీటర్ రూ.191, వేరుశనగ నూనె రూ.175, పామాయిల్ రూ.155కు మార్కెట్లో లభ్యమవుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. (ప్రతీకాత్మకచిత్రం)
రాష్ట్రవ్యాప్తంగా వంట నూనెల అక్రమ నిల్వలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా హోల్సేల్, రిటైల్ దుకాణాలతోపాటు సూపర్ మార్కెట్లు, ఆయిల్ తయారీ సంస్థలపై దాడులు చేసిన అధికారులు 141 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర సరుకుల చట్టం కింద 65, తూనికలు–కొలతలు చట్టం కింద 1,056, ఆహార భద్రత చట్టం కింద 41, మరో 8 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మకచిత్రం)