త్వరలో తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ మొదటి వారం నుంచి గ్రూప్ 4తో పాటు.. గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీసుల నియామక నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయింది. త్వరలో గ్రూప్ 1 ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.
తర్వాత మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధం అవుతారు. ఇలా మొత్తం గ్రూప్ 1, 2, 3, 4 నోటఫికేషన్లకు సంబంధించి పరీక్షలు జరగున్నాయి. అయితే వీటిలో.. అన్ని నోటిఫికేషన్లకూ స్పందించి ప్రిపేర్ అవ్వాలా, ఏదో ఒక దాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాని కోసమే సన్నద్ధమవ్వాలా అనే సందిగ్ధతలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ ఇప్పటికే రాసివున్నారు కాబట్టి 2, 3, 4 నోటిఫికేషన్ల పరీక్షలు 2023 మేలో జరిగే అవకాశం ఉంది. కచ్చితంగా పాస్ అవుతాం అనుకునేవారు డిస్క్రిప్టివ్ పరీక్షలో ఉండే క్లిష్టతను బట్టి మెయిన్స్ రాయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవటం మంచిది. మెయిన్స్ కోణంలో ప్రిపరేషన్ సాగిస్తే.. గ్రూప్ 2, 3, 4 పరీక్షలు కూడా సులువుగా ఉంటాయి. కాకపోతే.. గ్రూప్ 1 ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లే వారు.. ప్రతి రోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం మంచింది.
783 ఖాళీలతో డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్రూప్-2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 3, 4కి కూడా దరఖాస్తు చేసుకుంటారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వారు.. గ్రూప్ 3 పరీక్ష కూడా సలువుగా ఉంటుంది. అయితే.. గ్రూప్ 4 లో సెక్రటేరియట్ ఎబిలిటీస్ పరీక్ష పేపర్ ను సపరేట్ కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే గ్రూప్-2 ప్రిపరేషన్పై అధిక దృష్టి పెట్టటం.. మిగతా నోటిఫికేషన్లను ఎదుర్కొనే వ్యూహాన్ని అనుసరించటం నిస్సందేహంగా సరైన నిర్ణయం అవుతుంది.
గ్రూప్-3లో 1373 ఖాళీలు గుర్తించారు. వీటికి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రూప్-3, 4లకు మాత్రమే సిద్ధపడదాం అనుకునేవాళ్లు సిలబస్ ఒకటే కాబట్టి గ్రూప్-2 స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్-3 పరీక్షను సులభంగా ఎదుర్కోవచ్చు. గ్రూప్ 3 పోస్టుల కోసం మాత్రమే ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్లు.. గ్రూప్ 2, 4లను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది.
గ్రూప్-4లో 9,168 ఉద్యోగాలున్నాయి. వీటిలో ఇంకా కొన్ని పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ నుంచి ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ ఇంత వరకు విడుదల కాలేదు. ఏర్పడిన తర్వాత పోలీస్ కాకుండా.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో పోస్టులు ఇప్పటి వరకు విడుదల కాలేదు. అయితే ఈ పోస్టులకు పోటీ విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఉపాధ్యాయ, ఇంజినీరింగ్ ఉద్యోగాల ఆశావహులు మొదలైనవారు పెద్ద సంఖ్యలో పోటీ అభ్యర్థులుగా ఉంటారు. అందుకే ప్రతి మార్కూ అత్యంత విలువైనదని గుర్తించాలి. ఏదో ఒక జాబ్ కొట్టాలి అని అనుకునే వారంతా ఈ గ్రూప్ 4 ఉద్యోగాలే మెయిన్ టార్గెట్ గా మారుతాయి. కాబట్టి.. చదివిన పుస్తకాలను .. మళ్లీ మళ్లీ రిపీట్ చేసుకుంటూ చదువుకోవాలి. గ్రూప్ 4 టార్గెట్ అనుకుంటే.. గ్రూప్ 2, 3 లాంటి పోస్టులకు వెళ్లకపోవడం మంచిది. గ్రూప్ 4 లో రెండు పేపర్లే ఉంటాయి కాబట్టి.. సులువుగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ లో వచ్చిన ప్రశ్నల సరళి సివిల్స్ ను మించి ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని సబ్జెక్ట్ పై లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ చరిత్ర- సంస్కృతి, కళలు, సాహిత్యం, తెలంగాణ పాలన విధానాలు, పథకాలు, తెలంగాణ జాగ్రఫీ, సొసైటీ, తెలంగాణ ఉద్యమం, ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాలు సిలబస్లో ఉన్నందున ఆయా విషయాలపై గట్టి పట్టు సాధించటం ద్వారా అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు పొందవచ్చు.