భారత పౌరుల అని చెప్పుకోవడానికి, ప్రభుత్వ పథకాలు పొందడానికి.. ఇలా కొన్నింటికి ఆధార్ తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. మనుషులకైతే ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు ఉంటాయి.. మరి అధికారులు దేవుడికి ఆధార్ కార్డు అడిగితే ఏం చేయాలి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో ఎదురైంది. ఉత్తరప్రదేశ్ బండా జిల్లాలోని అత్తారా తహసీల్లోని కుర్హారా గ్రామానికి చెందిన మహంత్ రామ్కుమార్ దాస్ స్థానికంగా ఉన్న సీతారామచంద్ర ఆలయంలో ప్రధాన పూజారిగా ఉన్నారు. అంతేకాకుండా ఆలయ బాగోగులు చూసుకుంటున్నారు. ఆలయానికి సంబంధించిన భూమిలో గోధుమ పంట వేశాడు. 100 క్వింటాళ్లకు పైనే పండింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దాస్ తమ పంటను అమ్మడానికి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని.. పంట తీసుకుని ప్రభుత్వ మార్కెట్ యార్డ్కి వెళ్లారు.
అక్కడ రామ్కుమార్ వింత పరిస్థితి ఎదురైంది. అక్కడ అధికారులు.. భూమి ఎవరిపేరు మీద ఉందో వారి ఆధార్ కార్డు సమర్పించాలని కోరారు. అయితే ఏడు హెక్టార్ల భూమి జానకి రాముల పేరిట రిజిస్టర్ అయి ఉంది. దీంతో షాక్ తిన్న రామ్కుమార్కు ఏం చేయాలో తోచలేదు. అధికారులు చెబుతున్న దాన్నిబట్టి.. పంట అమ్మాలంటే శ్రీరామ స్వామి ఆధార్ కార్డు సమర్పించాలి. ఈ క్రమంలో తాను శ్రీరామ స్వామి ఆధార్ కార్డు ఎలా తీసుకురాగలనని రామ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) సౌరభ్ శుక్లాతో తన సమస్య గురించి వివరించాడు. అయితే ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయలేమని.. పంట కొనలేమని ఆ అధికారి చెప్పారు. దీంతో రామ్కుమార్ మరింత ఆలోచనలో పడ్డారు.
తాను గతేడాది ప్రభుత్వ మండిలో 150 క్వింటాళ్ల ధాన్యం అమ్మినట్టు రామ్కుమార్ తెలిపారు. గత కొన్నేళ్లుగా ధాన్యం అమ్ముతున్నట్టు చెప్పారు. అయితే ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని.. ఇప్పుడే తొలిసారిగి ఇటువంటి నిబంధనలు చూస్తున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్మకపోతే తన కుటుంబం పస్తులతో చావడం తప్ప వేరే మార్గం లేదని కంట తడి పెట్టకున్నాడు.
జిల్లా పౌరసరఫరాల అధికారి గోవింద్ ఉపాధ్యా మాట్లాడుతూ.. ఆలయాలు, మఠాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వ్యక్తుల ఆధార్ కార్డు లేకుండా మండి అధికారులు కొనుగోలు చేయరాదని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. రామ్కుమార్ను దేవుడి ఆధార్ కార్డు అడగలేదని, అతనికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి వివరించినట్టు ఎస్డీఎం తెలిపారు. ఇక, ఈ పరిస్థితుల్లో రామ్కుమార్ ముందు.. పండించిన ధాన్యాన్ని కమిషన్ ఏజెంట్స్కు చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన ఆప్షన్ మాత్రమే మిగిలి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.