హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Terror Attack: కశ్మీర్‌లో బ్యాంక్‌ మేనేజర్‌ని కాల్చి చంపిన ముష్కరులు .. వీడియో ఇదిగో

Terror Attack: కశ్మీర్‌లో బ్యాంక్‌ మేనేజర్‌ని కాల్చి చంపిన ముష్కరులు .. వీడియో ఇదిగో

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Terror Attack:జమ్ముకశ్మీర్‌లో మరోసారి టెర్రరిస్ట్‌లు తెగబడ్డారు. సాధారణ పౌరులే లక్ష్యంగా హింసాత్మక ఘఠనలకు పూనుకుంటున్నారు. తాజాగా కుల్గాం జిల్లాలో ఓ బ్యాంక్‌లోకి చొరబడి మేనేజర్‌ని కాల్చి చంపారు. కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఇంకా చదవండి ...

గత కొంతకాలంగా దాడులు, కాల్పులు, పేలుళ్ల వంటి ఉగ్రఘాతుకాలు లేవని జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తెగబడ్డారు టెర్రరిస్ట్‌లు(Terrorist). అత్యంత దారుణంగా ఓ బ్యాంక్‌(Bank)‌లోకి చొరబడి ఉద్యోగులపై విచక్షారహితంగా కాల్పులు జరిపారు. జమ్ముకశ్మీర్‌(Jammu Kashmir)కుల్గాం(Kulgam)జిల్లాలోని ఆరేహ్‌ మోహన్‌పోరా(Areh Mohanpora) ప్రాంతంలో ఉన్న ఎలాఖతి దేహతి(Elakhati Dehati)బ్యాంక్‌లోకి చేతిలో తుపాకీ, బ్యాగ్(Gun), (Bag)తగిలించుకొని లోపలికి చొరబడ్డ ఉగ్రవాది అందులో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిపై కాల్పులు జరిపాడు. టెర్రరిస్ట్ బ్యాంక్‌లోకి అడుగుపెట్టిన సమయంలో ఎవర లేకపోవడంతో నేరుగా మేనేజర్‌ క్యాబిన్ (Manager‌ Cabin)దగ్గరకు వచ్చి గురిపెట్టి తుపాకీతో కాల్చాడు. ఈ దుర్ఘటనలో ఎలాఖాతి దేహతి బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌(Vijay Kumar)శరీరంలోకి బుల్లెట్‌లు దూసుకెళ్లడతం తీవ్రంగా గాయపడ్డాడు.

కుల్గాంలో ఉగ్రదాడి..

వెంటనే బ్యాంక్‌ మేనేజర్‌ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. గురువారం మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెర్రరిస్ట్‌ బ్యాంకులోకి చొరబడిన దగ్గర నుంచి మేనేజర్‌ విజయ్‌కుమార్‌పై కాల్పులు జరిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉగ్రవాదులు ఓ పథకం ప్రకారమే బ్యాంక్‌ని చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లుగా స్థానిక పోలీసులు నిర్ధారించారు. కాల్పులకు తెగబడి ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్‌ల కోసం పోలీసులు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నారు.



ప్రభుత్వ ఉద్యోగిపై కాల్పులు..

టెర్రరిస్టులు ..ఓ ప్రభుత్వ ఉద్యోగిని కాల్చి చంపడాన్ని స్థానికులు పిరిపిపంద చర్యగా చూస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న బ్యాంక్ మేనేజర్‌ ఏం చేశాడని కాల్పి చంపారంటూ ప్రజాసంఘాలు సైతం మండిపడుతున్నాయి. కేవలం ఉనికి కోసం టెర్రరిస్ట్‌లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. మృతుడు ఎలాఖతి దేహతి బ్యాంక్‌ మేనేజర్ స్వస్థలం రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌ ప్రాంతానికి చెందిన వాడు. ఈమధ్యకాలంలోనే ఆరేహ్‌ మోహన్‌పోరా బ్యాంచ్‌కి బదిలీ కాబడ్డాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దాడిని అటు ప్రజాసంఘాలు సైతం ఖండిస్తున్నాయి.


సామాన్య ప్రజలే టార్గెట్‌గా..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. మూడ్రోజుల క్రితం కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొరాలోని ఓ రజనీ బాల అనే టీచర్‌ని హతమార్చారు. తమ ఉనికిని చాటుకొని సామాన్య ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాహుల్‌ భట్‌ అనే కశ్మీరీ పండిట్‌ ఉద్యోగిని కాల్చిచంపిన ఉగ్రవాదులు మరో హిందూ టీచర్‌ని పొట్టనపెట్టుకున్నారు. రజనీ బాల స్వస్తలం జమ్ములోని సాంబా జిల్లా. మే నెలలో ముస్లీమేతర ఉద్యోగుల్ని హత్య చేయడం ఇది రెండోది కాగా..జూన్‌ మొదట్లో అదే ప్రాంతంలో మరో బ్యాంక్‌మ మేనేజర్‌ని హతమార్చడం కలకలం రేపుతోంది.

First published:

Tags: Jammu and Kashmir, Terror attack

ఉత్తమ కథలు