హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మరికొన్ని రోజులు మాంచెస్టర్‌లోనే టీమిండియా..ఎందుకో తెలుసా?

మరికొన్ని రోజులు మాంచెస్టర్‌లోనే టీమిండియా..ఎందుకో తెలుసా?

ఇండియన్ క్రికెట్ టీం(ఫైల్ ఫోటో)

ఇండియన్ క్రికెట్ టీం(ఫైల్ ఫోటో)

Cricket World Cup 219 | కొందరు ఆటగాళ్లు ఆదివారం మాంచెస్టర్‌ నుంచి బయలుదేరి స్వదేశానికి రానున్నారు. మరికొందరు ఆటగాళ్లు మాత్రం తమ కుటుంబీకులతో కలిసి మాంచెస్టర్ నుంచే నేరుగా విహారయాత్రకు వెళ్లనున్నారు.

సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చెందిన భారత జట్టు వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించడం తెలిసిందే. మాంచెస్టర్‌లో ఉంటూ వచ్చిన హోటల్‌ను ఇప్పటికే వారు ఖాళీ చేశారు.  అయితే భారత ఆటగాళ్ల స్వదేశీ పయనం కొన్ని రోజులు ఆలస్యంకానుంది. ఈ నెల 14(ఆదివారం) వరకు భారత ఆటగాళ్లు మాంచెస్టర్‌లోనే గడపనున్నారు.  ఆటగాళ్లకు విమాన టికెట్లు ఏర్పాటు చేయడంలో బీసీసీఐ విఫలంకావడంతో ఆదివారం వరకు ఆటగాళ్లు అక్కడే గడపాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వరల్డ్ కప్‌లో భారత పోరు ముగియడంతో కొందరు జట్టు ఆటగాళ్లకు ఈ నెల 14న మాంచెస్టర్ నుంచి న్యూఢిల్లీకి విమాన టికెట్లు బుక్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు మాంచెస్టర్‌లోని వేరే హోటళ్లలో బస చేస్తున్నారు.

అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం ఆ రోజున మాంచెస్టర్ నుంచి స్వదేశానికి రావడం లేదు. మాంచెస్టర్ నుంచి కొన్ని రోజుల పాటు విహారయాత్రకు వెళ్ల్లేందుకు ప్లాన్స్ చేసుకున్నారు. గత కొన్ని మాసాలుగా వరల్డ్ కప్ కారణంగా అవిశ్రాంతంగా గడిపిన ఆటగాళ్లు...తమ కుటుంబీకులతో కలిసి వెకేషన్‌కు వెళ్లనున్నారు.

First published:

Tags: Cricket, ICC Cricket World Cup 2019

ఉత్తమ కథలు