SANGAI DEER THAT ESCAPED FROM FLASH FLOODS RESCUED AND TREATED BY MANIPURI VILLAGERS PVN
Viral Video : సపర్యలు చేసి..జింక ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు
అంతరించిపోయే దశలో ఉన్న సంగై జింక
Sangai Deer Rescued : ఈశాన్య భారతంలో వరద బీభత్సం కొనసాగుతున్నది. అక్కడి రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. వేలాది గ్రామాలు ఇంకా నీటమునిగాయి.
Sangai Deer Rescued : ఈశాన్య భారతంలో వరద బీభత్సం కొనసాగుతున్నది. అక్కడి రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. వేలాది గ్రామాలు ఇంకా నీటమునిగాయి. లక్షలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. ముఖ్యంగా అసోంలో వరదల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. వరదల కారణంగా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటివరకు మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 జిల్లాల్లో దాదాపు 7.2 లక్షల మంది వరద ప్రభావంలో కొనసాగుతున్నారు.
అయితే ఆకస్మిక వరదల నుంచి తప్పించుకునేందుకు అంతరించిపోయే దశలో ఉన్న ఓ సంగై జింక మణిపూర్ లోని ఓ గ్రామానికి చేరుకుంది. వణుకుతూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న జింకను చూసి గ్రామస్తులు చలించిపోయారు. దాన్ని చేరదీశారు. దానికి సపర్యలు చేసి, ప్రాణాలు కాపాడారు.అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని సమీపంలోని అడవుల్లోకి విడిచిపెట్టారు. ఈ వీడియోను అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల రాష్ట్ర మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ ఆన్లైన్లో షేర్ చేశారు. హృదయాన్ని కదిలించే ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియో క్లిప్ లో... అలసిపోయిన జింక పడుకున్నట్లు మరియు ఒక వ్యక్తి దానిని తడుముతున్నట్లు చూపిస్తుంది. దాని కాళ్లు కట్టివేయబడి ఉండడంతో గ్రామస్థులు మాట్లాడుకోవడం వింటోంది. ఆ తర్వాత ఆ జింకకు గ్రామస్తులు సపర్యలు చేయడం కనిపిస్తోంది.
#Sangai deer, an endangered species of Manipur ran away to a village from his habitat in order to escape from flash floods in the forest areas.
— Th.Biswajit Singh (@BiswajitThongam) May 22, 2022
అంతరించిపోతున్న సంగై జింకలు విలక్షణమైన కొమ్ములు మరియు చాలా పొడవాటి కనుబొమ్మలను కలిగి ఉంటాయి. వాటి కనుబొమ్మల నుండి ముందుకు పొడుచుకు వచ్చిన కిరణాలు బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నందున వాటిని నుదురు-కొమ్ముల జింక అని కూడా పిలుస్తారు.
ఇదిలా ఉండగా, ఈశాన్య రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించిన సమస్యలపై న్యూఢిల్లీలో ఎన్హెచ్ఏఐ చైర్పర్సన్ అల్కా ఉపాధ్యాయతో చర్చించినట్లు అసోం సీఎం ఆదివారం తెలిపారు. వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన జాతీయ రహదారులను అత్యవసరంగా మరమ్మతులు చేయాలని మరియు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పాను అని ఆయన ట్విట్టర్లో తెలిపారు
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.