హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

KTR Tweets: మా అమ్మ ఎండలో తిరుగుతుంటే.. నువ్వు విదేశాల్లో ఎంజాయ్​ చేస్తావా? కేటీఆర్​పై ఓ నెటిజన్​ ఆగ్రహం

KTR Tweets: మా అమ్మ ఎండలో తిరుగుతుంటే.. నువ్వు విదేశాల్లో ఎంజాయ్​ చేస్తావా? కేటీఆర్​పై ఓ నెటిజన్​ ఆగ్రహం

మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

కేటీఆర్​ ఇటీవలె దావోస్​ వెళ్లారు. పర్యటన ముగిశాక ట్విటర్​లో పిక్చర్‌ పర్ఫెక్ట్‌ వాతావరణంలో జ్యూరిచ్‌లో వీధి పక్కన కూర్చొని భోజనం.. కుడోస్‌ దావోస్‌.. టిల్‌ నెక్ట్స్‌ టైం (మళ్లీ వచ్చే వరకు గుడ్‌బై దావోస్‌)’ అంటూ ఆ ఫొటోలతో ట్వీట్‌ చేశారు. అయితే దీనిపై ఓ నెటిజన్​ మండిపడ్డాడు.

ఇంకా చదవండి ...

తెలంగాణ మంత్రి కేటీఆర్​ (Minister KTR) సోషల్​ మీడియాలో యాక్టీవ్​గా ఉంటారు. ఆయన తన భావాలను ట్విటర్​ (Twitter)లో ఎక్కువగా వ్యక్తపరుస్తాడనే విషయం తెలిసిందే. దేశ రాజకీయాలు, ప్రజల సమస్యలు తదితరాలపై ట్విటర్​నే ఆయన ఎక్కువగా వేదికగా చేసుకుంటారు. ఇటీవలె దావోస్​కు వెళ్లారు మంత్రి కేటీఆర్​.  యూకే, దావోస్‌ (Davos)లో పది రోజులపాటు పర్యటించిన కేటీఆర్‌.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యారు.  ఈ పర్యటనకు (Davos tour) సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకొన్నారు కేటీఆర్​. చక్కని వాతావరణంలో జ్యూరిచ్‌లో వీధి పక్కన కూర్చొని భోజనం.. కుడోస్‌ దావోస్‌.. టిల్‌ నెక్ట్స్‌ టైం (మళ్లీ వచ్చే వరకు గుడ్‌బై దావోస్‌)’ అంటూ  ఫొటోలతో మంత్రి కేటీఆర్​ ట్వీట్‌ (KTR Tweets) చేశారు. ఆ ఫొటో మాత్రం అలా హీరోలా పోజిస్తూ దిగడంతో నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురిసింది.

ఈ ట్వీట్​పై పలువురు నెటిజన్లు (Netizens) పలు రకాలుగా స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఓ హీరోని కోల్పోయింది..! అని ఒకరంటే.. మరొక నెటిజన్​ తెలుగు పరిశ్రమ కాదేమో పూర్తి భారతీయ సినీ పరిశ్రమేమో అని నా డౌటానుమానమండయ్యా... ఎందుకంటే ఆ మీసకట్టు లేని ముఖారవిందం నాకైతే బాలీవుడ్ హీరోలనే జ్ఞప్తికి తెస్తోంది మరి.. అని రిప్లై ఇచ్చాడు.

అయితే  జ్యూరిచ్​ ఫొటోపై మెల్​బోర్న్​లో ఉన్న ఓ తెలుగు నెటిజన్​ మండిపడుతూ ఓ కామెంట్​ పెట్టాడు. ‘‘అయ్యా, ఇక్కడ మీ CS ఏదొ Order పాస్ చేశాడట. పాపం ఉదయం నుంచి ఎర్రటి ఎండలో మా అమ్మ Orders పట్టుకొని Peddapalli - Karimnagar - jagityal తిరిగింది . చివరలకి ఓక్కటె మాట అన్నది, ఏం పాపం చేశా అని ఇలా అవుతుంది అని. మీరు మాత్రం స్విట్జర్లాండ్​లో ఎంజాయ్​ చేస్తున్నారు. మీ తండ్రి గారేమో బెంగళూరులో ఉన్నాడు. దేవుళ్ల అయ్యా మీరు’’ అంటూ తన గోడును ట్విటర్​ వేదికగా ఎలుగెత్తాడు.

ఈ కామెంట్​కు పలువురు నెటిజన్లు కూడా కౌంటర్​ ఇచ్చారు. మీరు మెల్​బోర్న్​లో ఉండి ఎంజాయ్​ చేస్తున్నారు కదా అని ఒక నెటిజన్​ ప్రశ్నించాడు.  ఇక మరో నెటిజన్​ స్పందిస్తూ.. నీకో దండం రా సామీ, అతను తెలంగాణాలో పెట్టుబడి కోసం దావోస్ వెళ్ళాడు, తద్వారా  చాలా మందికి ఉద్యోగం వస్తుంది” అని తెలిపాడు.

కాగా, ఆ ట్వీట్​లో నెటిజన్​ మండిపడటానికి కారణం.. టీచర్ల బదిలీలపై సీఎస్​ సోమేశ్​ కుమార్​ ఆర్డర్​. పరస్పర అంగీకారం నేపథ్యంలో బదిలీలు చేసుకోవచ్చని ప్రభుత్వ ఇప్పటికే ఆర్డర్​ ఇచ్చింది. అయితే ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో కొన్ని పరిమితులు విధించింది. దీంతో ఈ నిబంధనలు టీచర్లకు ఇబ్బందిగా మారాయి. దీనిపైనే కేటీఆర్ను ఆ నెటిజన ప్రశ్నించాడు.

First published:

Tags: KTR, Netizen, Tweets

ఉత్తమ కథలు