పురాతన నాణేలకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఒక్క నాణెమైనా లక్షల్లో ధర పలుకుతుంది. అలాంటిది... ఆ ఊరోళ్లకు చాలా నాణేలు ఈజీగా దొరుకుతున్నాయి. అసలేమైందంటే... మధ్యప్రదేశ్లోని చాలా జిల్లాల్లో ఈమధ్య భారీగా వర్షాలు పడి వరదలు వచ్చాయి. ఆ నీరంతా సింధ్ నదిలోకి వెళ్లింది. దాంతో నదీ గర్భంలో పెద్ద కదలిక వచ్చింది. దాంతో... అప్పటివరకూ నదిలో ఉన్న వెండి నాణేలు... నీటిలో కదులుతూ... శివపురి జిల్లా... అశోక్నగర్లోని పంచవళి గ్రామంలో ఒడ్డుకు రావడం మొదలైంది. కొన్ని రోజులుగా పెరిగిన నీరు... ఆదివారం తగ్గింది. అప్పుడు నది ఒడ్డున ఉన్న ఇసుకలో మెరుస్తూ వెండి నాణేలు కనిపించడంతో... ఊరోళ్లంతా పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. పొలాల్లో వాళ్లు పంట పనులు మానేసి... అక్కడికి వెళ్లారు. అంతా వెళ్లి... నాది నాది అంటూ... ఆ నాణేలను పోటీపడి మరీ ఏరుకుంటున్నారు.
నిజానికి ఈ వరదల వల్ల 600 ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగాయి. 1200 మంది ఇళ్లు కోల్పోయారు. ఇలాంటి విషాద పరిస్థితుల మధ్య వారికి ఈ నాణేలు లభించాయి. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం నదిలో నీరు చాలా ఎక్కువే ఉంది. కానీ... కొన్ని కాయిన్లు ఇసుకలో దొరికే సరికి... నది నీటిలో మరిన్ని కాయిన్లు దొరుకుతాయి అనే ఉద్దేశంతో చాలా మంది నదిలో దిగుతున్నారు. లక్కీగా అక్కడ ఏ సుడిగుండాలూ లేవు. కానీ నీటిలో వారికి కాయిన్లు దొరకట్లేదు.
#MadhyaPradesh: About 50 silver coins were found on the Ghat of the Pachavali Sindh river, Shivpuri. These coins are said to be of the year 1862. A large number of police forces have been deployed on the spot. pic.twitter.com/2uasnZnNgo
— Journalist Siraj Noorani (@sirajnoorani) August 8, 2021
ఇప్పటివరకూ దొరికిన నాణేలు... 280 ఏళ్ల కిందటివి అని తెలిసింది. అంటే 18వ శతాబ్దం నాటివి అన్నమాట. వాటిపై బ్రిటీష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయి. అంటే... 1840లో ఈస్ట్ ఇండియా కంపెనీ... వీటిని ముద్రించింది. ఐతే... ఈ నాణేలు ఎక్కడి నుంచి ఇలా వచ్చాయి... నదిలోనే ఇన్నేళ్లూ ఉన్నాయా అనే డౌట్లు ఉన్నాయి.
ఈ విషయం అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. వెంటనే స్థానిక పోలీసులకు కాల్ చేసి... నది దగ్గరకు వెళ్లి... ఎవరూ కాయిన్లు పట్టుకుపోకుండా చూడమని ఆదేశించారు. అక్కడ దొరికే కాయిన్లను ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం, భారీగా పెరిగిన వెండి. నేటి రేట్లు ఇవీ
ఇక్కడో షాకింగ్ విషయం ఉంది. వారం కిందట... ఓ జాలరికి చిన్న కుండలో వెండి నాణేలు దొరికాయి. ఇప్పుడు మళ్లీ దొరుకుతున్నాయి. అందుకే ఇంకా ఇంకా దొరుకుతాయని భావిస్తున్నారు. ఇలా ఆ ఊరిలో నాణేల అంశం కలకలం రేపుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Viral, VIRAL NEWS