హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shobha Yatra : మత సామరస్యం అంటే ఇదే.. శోభాయాత్రలో పాల్గొన్న ముస్లింలు

Shobha Yatra : మత సామరస్యం అంటే ఇదే.. శోభాయాత్రలో పాల్గొన్న ముస్లింలు

శోభాయాత్రలో పాల్గొన్న ముస్లింలు (image credit - twitter - ANI)

శోభాయాత్రలో పాల్గొన్న ముస్లింలు (image credit - twitter - ANI)

Shobha Yatra : మన భారతదేశం గొప్ప దేశం. ఎన్నో మతాలకు పుట్టినిల్లు. అలాంటి చోట ప్రజలు.. అన్ని మతాలనూ గౌరవిస్తూ.. అన్ని పండుగల్లో పాల్గొంటారు. మత సామరస్యాన్ని చాటిచెబుతారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పదనం. మన దేశంలో ఎన్నో భాషలు, ఎన్నో మతాలు ఉంటాయి. అయినప్పటికీ ప్రజలంతా కలిసిమెలిసి ఉంటారు. దైవ కార్యకలాపాల్లో అందరూ కలిసి పాల్గొంటారు. అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో... ముస్లింలు కూడా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించారు. తద్వారా భారతదేశంలో మత సామరస్యాన్ని చాటిచెప్పారు. తాజాగా.. ఒడిశాలో జరిగిన శ్రీరామనవమి శోభాయాత్రలో ముస్లింలు కూడా పాల్గొన్నారు.

ఒడిశాలోని భద్రక్ ఏరియాలో ఈ శోభాయాత్ర జరిగింది. ఇందులో రామభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐతే.. ఇందులో ముస్లింలు కూడా పాల్గొనడంతో.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "శోభా యాత్రకు స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చాం. అందరికీ రామ నవమి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఉన్నారు. మేము ఇక్కడ అందరం కలిసి ఇది జరుపుకుంటున్నాము" అని భద్రక్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ గుల్మాకి దలావ్జీ హబీబ్ తెలిపారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. "మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం అనేవి భారతదేశ శాశ్వత అంశాలు. భారతదేశం కులం, మతం, జాతి, మతం, భాషలతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడికి చెందినది" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.

ఈ వీడియోని కొందరు నెటిజన్లు తప్పు పడుతున్నారు. "మోసపోవద్దు. వారు మీకు హింసను చూపించరు.. రంజాన్ జరుపుకునే హిందువులను వారు చూపించరు" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు.

First published:

Tags: Srirama navami

ఉత్తమ కథలు