మధ్యప్రదేశ్(Madhya Pradesh)బుర్హాన్పూర్(Burhanpur)లో మూడేళ్ల చిన్నారి తన తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వార్త వైరల్ అయింది. చివరకు ఆ వార్తపై రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం స్పందించారు. అమ్మ చాక్లెట్లు ఇవ్వలేదని అందుకే ఆమెను జైల్లో పెట్టమని పోలీసులకు మూడేళ్ల బాలుడు కోరడం..ఆ వీడియో వైరల్ కావడంతో హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా(Narottam Mishra)కు చేరడంతో అధికారుల ద్వారా బాలుడికి ఫోన్ చేసిన వీడియో కాల్(Video call)మాట్లాడారు. దేని కోసం పోలీస్ స్టేషన్(Police station)లో కేసు పెట్టావని అడిగితే చాక్లెట్ల కోసమని చెప్పడంతో మంత్రి నవ్వు ఆపుకోలేకపోయారు. పిల్లవాడి అమాయకత్వం, ముద్దు ముద్దు మాటలకు ముగ్ధుడైన హోంమంత్రి బాలుడు సద్దాం(Saddam)కు చాక్లెట్లు(Chocolates)తో పాటు ఓ సైకిల్(Cycle)ని కూడా బహుమతిగా పంపుతున్నాని చెప్పారు. పిల్లవాడికి మాటిచ్చిన ప్రకారం వాటిని అతడికి అందేలా చూడాలని అధికారులకు సూచించారు మంత్రి నరోత్తమ్ మిశ్రా. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
బాలుడికి హోంమంత్రి ఫోన్..
చిన్నపిల్లలు నేరాలు చేయడం చూశాం. నేరాలు చేసిన వాళ్లను గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. చివరకు తమకు అన్యాయం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కేసులు ఉన్నాయి. కాని మధ్యప్రదేశ్లో కనీసం మాటలు కూడా పూర్తిగా రాని మూడేళ్ల సద్దాం అనే బాలుడి వ్యవహారించిన తీరు వైరల్ అవుతోంది. బుర్హాన్పూర్లోని ఖక్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెడ్తలై గ్రామానికి చెందిన రెండేళ్ల బుడతడే సద్దాం. ఇంట్లో అమ్మ తిట్టిందనే కోపంతో ఏకంగా ఇంటికి సమీపంలో ఉన్న డెడ్తలై పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ డ్యూటీలో ఉన్న లేడీ ఎస్ఐ ప్రియాంక నాయక్కు ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్పాడు. తనను తల్లి మందలించిందని ఆమెపై ఫిర్యాదు నమోదు చేయమని కోరాడు. మా అమ్మను శిక్షించండి అంటూ కోపంతో తెలిసి, తెలియని వయసులో మాట్లాడుతున్న మాటలను విని ఆశ్చర్యపోయింది లేడీ ఎస్ఐ.
తల్లిపైనే కొడుకు ఫిర్యాదు..
అయితే సద్దాం మాటలతో ముచ్చటపడిపోయిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక నాయక్ పోలీస్ వ్యవస్థపై, పోలీసులపై పిల్లాడికి నమ్మకం కలిగించాలని కంప్లైంట్ తీసుకుంటున్నట్లుగా అతను చెప్పిన విషయాల్ని ఓ పేపర్పై తానే స్వయంగా రాసింది. అంతే కాదు తల్లి మందలింపుతో చిన్నబుచ్చుకున్న పిల్లాడి మనసును అర్ధం చేసుకొని కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది ఎస్ఐ ప్రియాంక నాయక్.
వైరల్ అవుతున్న వీడియో..
అనంతరం చిన్నారి సద్దాం ద్వారా తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని వారికి కబురు చేసి స్టేషన్కు పిలిపించి అతడ్ని అప్పగించారు. చిన్న పిల్లల మనసు సున్నితంగా ఉంటాయని వాళ్ల మనసులు నొప్పించకుండా చూసుకోమని ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఎస్ఐతో బాలుడు కంప్లైంట్ చేసేందుకు వచ్చిన సందర్భంలో స్టేషన్లో ఉన్న మరో పోలీస్ వాళ్లిద్దరి మధ్య సంభాషణను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Trending news, Viral Video